చేనేత కార్మికులను ఆదుకోవాలి
ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసిన నారాలోకేష్

అమరావతి: లాక్డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ వల్ల దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 81 వేల పవర్ లూమ్ కార్మికులపైనా లాక్డౌన్ ప్రబావం చూపింది. వారి జీవన విధానం దెబ్బతినటమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముడుకాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ట్వీట్ చేశారు. అదే విదంగా మరోక ట్వీట్లో ఆప్కో ద్వారా నేతన్నల వద్ద తయారై సిద్దంగా ఉన్న స్టాక్ను వెంటనే కొనుగోలు చేయాలి. లాక్డౌన్ సమయంలో వీరంతా ఆర్దిక ఇబ్బందులు పడుతున్నందున ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల సాయం అందించాలి. క్లిష్ట సమయంలో నేతన్నల పట్ల ప్రభుత్వం దయచూపుతుందని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు.
తాజ తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/