ఇండోనేషియాలో కొత్తగా 693 కరోనా కేసులు

ఇండోనేషియాలో మొత్తం కేసుల సంఖ్య 19,189

Corona updates -AP
Corona virus

ఇండోనేషియా: కరోనా మహమ్మారి కేసులు ఇండోనేషియాలో భారీగా పెరిగాయి. బుధవారం 693 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,189కి చేరింది. ఇండోనేషియా కోవిడ్19 టాస్క్ ఫోర్స్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం, రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బుధవారం భారీగా పెరిగాయి. 693 మందికి కోవిడ్19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. బుధవారం 21 మంది కోవిడ్19 రోగులు మరణించినట్లు కోవిడ్19 టాస్క్ ఫోర్స్ వెబ్‌సైట్ తెలిపింది. దీంతో ఈ వ్యాధి కారణంగా మరణించినవారి సంఖ్య 1,242కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న రోగుల సంఖ్య 4,575కు చేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/