డిసెంబర్ 8న బీసీ సభను నిర్వహించనున్న వైఎస్ఆర్సిపి
సభకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందన్న మంత్రి చెల్లుబోయిన
అమరావతిః వచ్చే నెల 8వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున బీసీ సభను వైఎస్ఆర్సిపి నిర్వహించబోతోంది. ఎన్నికల నేపథ్యంలో బీసీలపై వైఎస్ఆర్సిపి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ… బీసీ సభకు ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి జగన్ ఒక డిక్లరేషన్ ను ప్రకటించారని తెలిపారు. 139 బీసీ కులాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి సంక్షేమ ఫలాలను అందించారని కొనియాడాడు.
బీసీలకు టిడిపి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని మంత్రి చెప్పారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని ఎలా పెంపొందించిందో తెలియజేస్తామని అన్నారు. బీసీ వర్గాలన్నీ వైఎస్ఆర్సిపికి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యారని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/