నేడు మహారాష్ట్రలో కూడా జాతీయ గీతాలాపన కార్యక్రమం

National Anthem program in Maharashtra too today

ముంబయిః దేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యుడు, సంపన్నుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ గీతాలాపన జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెసిఆర్ బాటలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఈరోజు 11 గంటలకు మహారాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

కాగా, జాతీయ గీతాలాపన నేపథ్యంలో హైదరాబాదులోని రహదారులపై సైతం ఆ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లమీదే వాహనదారులు జాతీయగీతాన్ని ఆలపించారు. అబిడ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ జాతీయగీతాన్ని ఆలపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/