నేడు జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

ఢిల్లిలో రాత్రి 8 గంటలకు ప్రధాని మోడి ప్రసంగం

pm modi
pm modi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశ ప్రజల్లో కలవరం సృష్టిస్తుంది. ఈతరుణంలో ప్రధాని మోడి ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లిలో రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, నిరోధక చర్యలపై ప్రధాని మాట్లాడనున్నారు. ప్రజలకు పలు సూచనలు చేయనున్నారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 150కి పైగా దేశాలకు కరోనా వ్యాపించిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/