ఈడీ విచారణకు హాజరైన అనిల్‌ అంబానీ!

Anil Ambani appears before ED in Mumbai
Anil Ambani appears before ED in Mumbai

ముంబయి: అడాగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎస్‌బ్యాంకు కేసులో సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన ఈరోజు ముంయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎస్‌బ్యాంకు నుండి తీసుకున్న రుణాల విషయంలో అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని ఈసందర్భంగా రికార్డు చేసే అవకాశం ఉంది. కాగా ఈవిషయంలో అడాగ్‌ గ్రూపుకు చెందిన మరికొందరికి కూడా ఈడీ త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. ఎస్‌బ్యాంకు సంక్షోభంలో ఇప్పటికే ఆబ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన అధికారులు గత కొన్ని రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/