లాక్‌డౌన్‌ అనంతరం చర్యలపై సిఎంలతో ప్రధాని

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని..లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు లేక కొనసాగింపుపై చర్చ

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి అన్ని రాష్ట్రల సిఎంలతో వీడియోస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ నేపథ్యలో విధించిన లాక్‌డౌన్‌పై ముఖంగా చర్చ జరుగుతుంది. కాగా లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధాని మోడి చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని పలు రాష్ట్రాల సిఎంలు కోరారు. అలాగే, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సాయం వంటి అంశాలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. కీలకంగా చర్చిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/