గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రెండూ మానవాళి చరిత్రను మలుపుతిప్పాయిః సిఎం జగన్‌

గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకు జగన్ సందేశం

jagan-message-on-good-friday

అమరావతిః నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ ప్రభువుకు శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండు రోజులూ మానవాళి చరిత్రను మలుపుతిప్పిన ఘట్టాలని అన్నారు. తొటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం… ఇదే మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం అని చెప్పారు.