భారత్‌లో ఒక్కరోజులో 14,821 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 4,25,282

india-reports-14821-cases-in-last-24-hrs

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది.గత 24 గంటల్లో దేశంలో 14,821 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 445 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,25,282కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 13,699కి పెరిగింది. 1,74,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,37,196 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/