దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్
ఉగ్రవాద దాడులు జరగొచ్చంటూ నిఘా వర్గాల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేశారు. జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలో దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గెస్ట్ హౌస్లు, హోటళ్లు, బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలిస్తున్నారు. ఢిల్లీ బయట కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/