సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ

హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత.. సీబీఐ విచారణ గడుపు పొడిగింపు

disappointment-for-ys-avinash-reddy-in-supreme-court

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. వివేకా కూతురు సునీతారెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ గడువుకు కూడా పొడిగించింది. జూన్ 30 వరకు విచారణ గడువును పొడిగించింది. సుప్రీంకోర్టు తీర్పుతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సాంప్రదాయాలకు దారి తీస్తాయని తెలిపింది.