అన్నమయ్య జిల్లాలో బస్సు ప్రమాదంపై 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్‌

శనివారం సాయంత్రం అన్నమయ్య జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటన లో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొంతమంది గాయపడడం తో వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఫై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అనౌన్స్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఇక లారీ డ్రైవర్‌ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.