కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు తప్పిన ప్రమాదం
ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ను ఢీకొన్న డేగ
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/05/karnataka-congress-president-dk-shivakumar-helicopter-was-hit-by-an-eagle-near-hoskote--jpg.webp)
బెంగళూరుః కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షడు డీకే శివకుమార్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలిక్యాప్టర్ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలిక్యాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీకే శివకుమార్ ములబగిలులో ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ మధ్యాహ్నం హెలిక్యాప్టర్లో బయలుదేరారు. ఆ హెలిక్యాప్టర్ హోసకోట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా డేగ వచ్చి ఢీకొట్టింది. దాంతో హెలిక్యాప్టర్ అద్దం పగిలిపోయింది. దాంతో హెలిక్యాప్టర్లో ఉన్న డీకే శివకుమార్కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.