నేడు పల్నాడులో చంద్రబాబు పర్యటన

chandrababu-comments-on-jagan

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పల్నాడు లో పర్యటించబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో చంద్రబాబు తన దూకుడు ను పెంచారు. ఐదేళ్లలో వైసీపీ పాలన ఫై విమర్శలు చేస్తూనే, మరోపక్క తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు.

ఈరోజు పల్నాడు లో బాబు పర్యటన కొనసాగనుంది. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల లో పర్యటించనున్నారు. అనంతరం క్రోసూరు , సత్తెనపల్లి ప్రాంతాల్లో ప్రజా గళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్లో క్రోసూరు చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రికి సత్తెనపల్లిలో బస చేయనున్నారు. నిన్న పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.