నేడు బీఆర్ఎస్ ‘రైతు దీక్ష’లు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుదీక్షలు చేపట్టనున్నది. ఉదయం 11 గంటల నుంచి ఈ దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో, అలాగే క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనీ గులాబీ నేతలు ఇవాళ దీక్షలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు పాల్గొంటారు. రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు” అని బీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతుదీక్షలు చేపట్టనున్నారు.