నేలపై కూర్చోటం వలన ప్రయోజనాలు…
ఆరోగ్యం .. అలవాట్లు
తినేటప్పుడు, టీవీ చూసేటప్పుడూ .. కుర్చీలమీదో , మంచాల మీదో కూర్చుని తింటూ ఉంటారు . గంటల తరబడి సోఫాలపై వాలిపోతుంటారు.. దీనివలన దీర్ఘ కాలంలో వెన్ను, నడుము నొప్పి, తుంటిలో నొప్పి వస్తుంతాయి.. అదే సమయంలో నెల మీద కూర్చోవటం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి . అవి ఏమిటంటే…
నేలమీద కూర్చొని తినటం వలన , మునుఁడకు వంగి తినాల్సివస్తుంది. అలా చేసే క్రమంలో పొట్ట కండరాలు కదులుతూ ఉంటాయి. దీని వలన జీర్ణ క్రియ సజావుగా సాగటానికి సాయపడే రసాలు విడుదల అవుతాయి.
గంటల తరబడి, సోఫాలో కూర్చోవద్దు.. ఆ అలవాటుని మానుకోలేకపోతుంటే , గూడ వారగా, చాప వేసి కింద కూర్చుని వీపుని నిటారుగా ఉంచి , కళ్ళను చాచండి.. దీనివల్ల లాడుము, కండరాలు బలపడతాయి. రఱచూ కింద నుంచి లేవటం, కూర్చోవటం వలన శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది.. ఆకలి అదుపులో ఉంటుంది . అలసట,శరీర బలహీనతలూ తగ్గుతాయి.
నెల మీద పద్మాసనంలో కూర్చోవటం వలన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నడుము చుట్టూ ఉన్న కండరాల నొప్పి తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోవచ్చు.
తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/