చంద్రబాబు ఫై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశంసలు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు..టీడీపీ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, మంత్రి అమిత్ షాను కలవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు వీర్రాజు స్పందిస్తూ.. వారిద్దరినీ చంద్రబాబు ఎందుకు కలిశారో ఆయననే అడగాలని అన్నారు. చంద్రబాబు గొప్ప నాయకుడని, తాను వెళ్లి ఆయనను కలవలేదని, అలాగని ఆయన అమిత్ షాను కలవడాన్ని తాను వ్యతిరేకించబోనని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సోము తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై కూడా సోము స్పందించారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, దీనిని వారే చూసుకుంటారని తెలిపారు.