హైదరాబాద్లోని ప్రిజం పబ్లో దారుణం..
హైదరాబాద్లోని ప్రిజం పబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి నంద కిషోర్ అనే కస్టమర్పై బౌన్సర్లు, పబ్ యజమాని దాడికి దిగారు. ముగ్గురు బౌన్సర్ల, యజమాని నంద కిషోర్ ను చితకబాదారు. ఈ దాడిలో నంద కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అసలు ఏంజరిగిందంటే.. నో స్మోకింగ్ జోన్లో స్మోక్ చేశానని, తనకు అసలు అది నో స్మోకింగ్ జోన్ అని తెలిదయని తెలిపారు. మొట్ట మొదటిసారిగా తాను పబ్కి వెళ్లానని చెప్పారు. బౌన్సర్స్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని అన్నాడు. ఈ దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయని .. తన ఫ్రెండ్స్ వచ్చి ఆపినా.. కాళ్లు పట్టుకున్నా తనను వదలలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.