రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ మృతి

పంజాగుట్ట కానిస్టేబుల్ గోల్కొండ స్వామి (36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైద్రాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న స్వామి.. బుధువారం విధులు ముగించుకొని నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట–హన్మంతాపూర్ మధ్యలో రోడ్డు ప్రమదం జరిగింది.

ఈ సమయంలో ఆటోలో నుంచి కిందపడ్డ స్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.