దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,53,708
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనాతో 666 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,73,728 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 17,677 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,35,32,126కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,53,708కు పెరిగింది. నిన్న 68,48,417 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దీంతో ఇప్పటివరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,01,30,28,411 కు చేరింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/