దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి. ఇందులో 4,37,83,788 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మరణించారు. మరో 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 12,875 మంది కరోనా నుంచి బయటపడగా, 41 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.62 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 211.39 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

తాజా సినిమా వార్తల కోసం కిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/