దేశంలో కొత్తగా 30,570 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325
మొత్తం మృతుల సంఖ్య 4,43,928
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 30,570 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,47,325కి చేరింది. అలాగే, నిన్న 38,303 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 431 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,928 కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,25,60,474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,42,923మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 64,51,423 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 76,57,17,137 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్యధికంగా కేరళలో 17,681 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 208 మంది మృతి చెందారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/