దేశంలో కొత్తగా 2,678 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో రోజువారీ కరోనా కేసులు రెండు వేలకు పైనే నమోదయ్యాయి. నిన్న 2,37,952 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,678 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,23,997కు చేరాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాకు బలైన వారి సంఖ్య 5,28,857కు చేరింది. ప్రస్తుతం దేశంలో 26,583 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.02 శాతం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.21 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/