నేను ఎవరో తెలుసా? అంటూ చిన్నారిని ప్రశ్నించిన ప్రధాని

లోక్ సభలో ఉద్యోగం చేస్తారుగా? అని బుదులిచ్చిన పాప

funny-moments-between-pm-modi-and-bjp-mp-5-year-old-daughter

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీకి, ఓ చిన్నారికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తన కుటుంబ సభ్యులతో కలసి పార్లమెంటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఫిరోజియా వెంట ఆయన కుమార్తె ఐదేళ్ల చిన్నారి అహనా ఫిరోజియా కూడా ఉంది. ఆమెతో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు వేశారు. ‘నేను ఎవరో నీకు తెలుసా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘తెలుసు. మీరు మోడీజీ. మీరు రోజూ టీవీలోకి వస్తారుగా’ అంటూ చిన్నారి అమాయకంగా బదులిచ్చింది. తర్వాత ‘నేను ఏం చేస్తానో నీకు తెలుసా?’ అని ప్రధాని అడిగారు. ‘మీరు లోక్ సభలో పనిచేస్తారుగా’ అని చెప్పడంతో.. అక్కడే ఉన్న అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి ప్రధాని సైతం కడుపుబ్బా నవ్వారు. పాపకు చాక్లెట్ ఇచ్చి పంపారు.

ప్రధాని చిన్న పిల్లలతో మమేకం అయిన ప్రతి సందర్భంలోనూ వారిని ప్రశ్నించడం అలవాటు. ప్రధానితో భేటీ వివరాలను అనిల్ ఫిరోజియా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘ఈ రోజు మరిచిపోలేనిది. ప్రపంచ నేత, ఎంతో విజయవంతమైన ప్రధాని, గౌరవనీయ మోడీజి కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని అనిల్ ఫిరోజియా పోస్ట్ పెట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/