తెలంగాణలో కొత్తగా 2,571 కేసులు
మృతుల సంఖ్య 886

Hyderabad: తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతున్నది.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెలువరించిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలోకొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో తొమ్మిది మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1, 40, 969కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 886కు పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/