అక్కినేని ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న ‘ఏజెంట్’ లేటెస్ట్ న్యూస్..

ఏజెంట్ కు సంబదించిన ఓ వార్త అక్కినేని అభిమానులను ఖంగారుకు గురి చేస్తుంది. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి.

కానీ ఈ మూవీ ఫై వస్తున్న వార్తలు అభిమానులను ఖంగారుకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ..రీ షూట్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్..ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రచారం మొదలుపెట్టలేదు. ఈ తరుణంలో ఇప్పుడు ఓ వార్త వైరల్ గా మారింది. ఏజెంట్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనే వార్త వైరల్ గా మారింది. ఒక పాటతో సహా దాదాపు 20 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందట. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ జరుగుతోంది. అంటే 23 రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా 20 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందనేది ఇప్పుడు అభిమానుల్లో టెన్షన్ పెడుతుంది. మరి మేకర్స్ చెప్పిన డేట్ కు వస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.