దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 12,66,589 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 11,850 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ముందు రోజు కంటే 5 శాతం కేసులు తగ్గాయి. గత 274 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 555 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,36,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,63,245 మంది కరోనా కారణంగా చనిపోయారు.

నిన్న 12,403 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు 3.44 కోట్ల మంది కరోనా బారిన పడగా… 3.38 కోట్ల మంది కోలుకున్నారు. మరోవైపు నిన్న 58.42 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారి సంఖ్య 1,11,40,48,134కి చేరుకుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/