పవన్ కు పోటీగా రంగంలోకి దిగుతున్న వీరాభిమాని..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 29 , 2022 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ కి పోటీగా పవన్ వీరాభిమాని రంగంలోకి దిగుతున్నాడు.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని నితిన్ నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ ను ఏప్రిల్ 29 , 2022 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. అదే రోజున పవన్ సినిమా వస్తున్న సరే..నితిన్ ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా తన సినిమాను రిలీజ్ చేసాడు. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అవినీతి రాజకీయాల చూట్టూ అల్లుకున్న కథ ఇది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.