నల్లారి కిషోర్‌ వాహనంపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణుల దాడి

మదనపల్లి సమీపంలో వాహనాలపై దాడి

nallari-kishore

అమరావతి: మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు దాడి చేశాయి. తంబళ్లపల్లి పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి కిషోర్ వెళ్తుండగా మదనపల్లి సమీపంలోని అంగళ్లు గ్రామం వద్ద వారి వాహనాలను వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో టిడిపి నేతల రెండు వాహనాలను వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు ధ్వంసం చేశాయి. పోలీసులు రంగంలోకి దిగి కిషోర్ కు అడ్డుగా నిలబడటంతో, ఆయకు ఏమీ కాలేదు. ఈ ఘటనపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/