మోడీ వస్తే కెసిఆర్ కు కరోనా, జ్వరం వస్తాయిః బండి సంజయ్

ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు మోడీ అన్న బండి సంజయ్

world-recognised-modi-as-boss-says-bandi-sanjay

వరంగల్‌ః ఏ మొహం పెట్టుకుని మోడీ తెలంగాణకు వస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించే మొహం పెట్టుకుని వచ్చారని, వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీని, టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసే మొహం పెట్టుకుని వచ్చారని, యువతకు ఉపాధి కల్పించే మొహం పెట్టుకుని వచ్చారని అన్నారు. సిఎం కెసిఆర్ ఏ మొహం పెట్టుకుని రాలేదని ప్రశ్నించారు.

ప్రపంచమే మోడీని బాస్ గా గుర్తిస్తోందని బండి సంజయ్ కొనియాడారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడు మోడీ అని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని అంటున్న కెసిఆర్… ఈ సభకు వచ్చి మాట్లాడాల్సిందని అన్నారు. మోడీ వస్తే కెసిఆర్ కు కోవిడ్ వస్తుందని, జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు.

ఒక సామాన్య కార్యకర్తనైన తనను బిజెపి కార్పొరేటర్ ను చేసిందని, ఎంపీని చేసిందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని చెప్పారు. ఒకప్పుడు మోడీని దగ్గర నుంచి చూస్తే చాలని అనుకున్నానని… ఇప్పుడు ఆయన భుజం మీద చేయి వేసి బండి అని పిలిచే స్థాయికి చేరుకున్నానని అన్నారు. మోడీ భుజం మీద చేయి వేస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పలేనని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.