వైస్సార్ జయంతి సందర్బంగా యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్బంగా యాత్ర 2 మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో ఓ పెద్ద చెయ్యి, చుట్టూ జనం.. అరచేతి పైకి జగన్ వెళ్తున్నట్టుగా యానిమేషన్ వీడియోను రూపొందించారు. ‘‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే.. నమస్తే..” అంటూ వైఎస్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.

‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’’ అనే డైలాగ్‌ని జగన్ పాత్రధారి చెప్పారు. ‘యాత్ర’ మొదటి భాగంలో వినిపించిన ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో వీడియో ముగుస్తుంది. ఇక యాత్ర 2 విషయానికి వస్తే..వైస్సార్సీపీ ఆవిర్భావం, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం కావడం వంటి అంశాలను యాత్ర 2 లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

YouTube video