ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపొతే ఎలా? : హైకోర్టు
అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో ప్రభుత్వ కాంట్రాక్టు పనుల బిల్లుపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకపొతే ఎలా? అని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. ఇలాగైతే ఎవరు ముందుకొస్తారని అడిగింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాల ఇబ్బదులు పడుతున్నారని.. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ సీఎస్ సమీర్ శర్మను హాజరుకావాలని ఆదేశిచింది. ఆయన హాజరవగా ధర్మాసనం ఈ వాఖ్యలు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/