బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలైనా టిడిపి సేవ చేస్తున్నారుః పురందేశ్వరిపై విమర్శలు

నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని వ్యాఖ్య

vijayasai-reddy-comments-on-purandeswari

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురందేశ్వరి మారారని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టిడిపికి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురందేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టిడిపి’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్‌లో చేరారంటూ మండిపడ్డారు.