సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో మోడీ సభ..ట్రఫిక్ ఆంక్షలు

Both BRS and Congress are family parties: PM Modi

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోడీ ఎల్‌బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సందర్బంగా ఆ రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రేపటి తో తెరపడనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఈ రెండు రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు , సమావేశాలు , రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీ ..తెలంగాణ లో పర్యటించగా..ఈరోజు మరోసారి పర్యటిస్తున్నారు.

శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు ప్రధాని హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి తెలిపారు. ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎల్‌బీస్టేడియం వరకు వచ్చే సమయంలో పీఎన్‌టీ ఫైఓవర్‌, గ్రీన్‌లాండ్స్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, రవీంద్రభారతి రూట్‌లో వాహనాలను అనుమతించరు. సభ పూర్తయిన తర్వాత ప్రధాని ఇదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే సమయంలో కూడా వాహనాలను అనుమతించరు. సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో వాహనాలను నిలిపేయడంగానీ, దారి మళ్లించడంగానీ చేస్తామని తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ స్టాచ్యూ వైపు వాహనాలను అనుమతించరు. సుజాత స్కూల్‌ వైపు నుంచి లతీఫ్ ఖాన్‌ బిల్డింగ్‌ వైపునకు వాహనాలను అనుమతించరు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పబ్లిక్‌ గార్డెన్‌, నాంపల్లి వైపునకు పంపనున్నారు.