ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడిన వారే వ్యతిరేకిస్తున్నారు

విశాఖను రాజధానిగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వం

Tammineni Sitaram
Tammineni Sitaram

అమరావతి: అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారే మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ..విశాఖపట్టణంను రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దీనిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే ఆయనను ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనివ్వమని స్పీకర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా తాను మాట్లాడటం లేదని, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఇది తన డిమాండ్‌ అన్నారు. విశాఖపై టిడిపి రాద్ధాంతం చేయడం తగదన్నారు. రాజధానిని అడ్డుకుంటే సహించేది లేదని తమ్మినేని సీతారాం హెచ్చరించారు. రాజధానితో సామాన్యుడికి పనిలేదని, అది ఎక్కడ ఉన్నా వారికి ఒకటేనని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/