ఆత్మహత్యాయత్నం చేసిన టిఆర్ఎస్ నాయకుడు
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కదనే అనుమానంతో అఘాయిత్యం
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదన్న అనుమానంతో ఓ టిఆర్ఎస్ నాయకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో గల మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆశావహులంతా మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే మంత్రి తన కార్యాలయంలో టికెట్ల అంశంపై చర్చలు జరుపుతున్నారు. అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని మనస్తాపానికి గురై, ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. దీంతో మంత్రి ఇంటి వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది. విషయం తెలిసిన మంత్రి తన ఇంటి వెనక నుంచి వెళ్లిపోయి మల్లారెడ్డి గార్డెన్స్కు చేరుకున్నారు. కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని మంత్రి పిలుపు కోసం వేచి చూశారు. దీంతో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడిన మల్లారెడ్డి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/