దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble CM of AP will Offer Pattu Vastralu to Goddess Kanaka Durga at Vijayawada LIVE

విజయవాడ : సీఎం జగన్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు.. సీఎంకు స్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య సీఎం జగన్ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/