టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన కెటిఆర్
మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పీర్జాదిగూడకు చెందిన తమ పార్టీ నేత దర్గా దయాకర్రెడ్డి తీరుపై ఆయన పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దర్గా దయాకర్రెడ్డి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో డబుల్ గేమ్ ఆడుతున్నారు. గంటల వ్యవధిలోనే రెండు పార్టీల నుంచీ ఆయన నామినేషన్ వేశారు. ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డితో కెటిఆర్ మాట్లాడనున్నారు. రెబల్స్ లిస్టుతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్కు వస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా భేటీ అవుతున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/