రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ కీలక విజ్ఞప్తి
మనం బతకాలన్నా, పక్కవారిని బతికించాలన్నా..లాక్డౌన్ తప్పనిసరి
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశలో పలు రాష్ట్రాలో లాక్డౌన్ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు మాత్రం లాక్డౌన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా జనాలు రోడ్ల మీదకు వచ్చారు. ఐదు మంది కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని, లేదంటే కరోనా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించినా ప్రజలు పట్టించుకోడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కెటిఆర్ ట్విటర్ ద్వారా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు .లాక్డౌన్ అనేది చాలా అరుదుగా ప్రకటించే చర్య అని.. ప్రభుత్వం అంత కఠిన నిర్ణయం తీసుకుందంటే, పరిస్థితి తీవ్రవను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. మనం బతకాలన్నా, పక్కవారిని బతికించాలన్నా.. స్వీయ క్రమశిక్షణ తప్పనిసరని కెటిఆర్ స్పష్టం చేశారు . మరోవైపు లాక్డౌన్ను ప్రజలు సీరియస్గా తీసుకోకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి కఠిన చర్యలు చేపట్టింది. రోడ్లపై బస్సులు, ఆటోలు, క్యాబ్స్తో పాటు బైక్స్, కారు వంటి ప్రైవేట్ వాహనాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బయటకు వచ్చినా.. ఇంటి నుంచి కి.మీ. పరిధి వరకు మాత్రం అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేవలం నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బయటకు రావాలని సూచించారు. లేదంటే భారీగా చలాన్లు విధిస్తామని స్పష్టం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/