నాలుగు మండ‌లాల్లో ద‌ళిత బందు నిధులు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక దళితబంధ పథకం మళ్లీ ప్రారంభం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ పథకం అమలుకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గంలో టీఆర్ఎస్ ఓడిన త‌ర్వాత ద‌ళిత బందు ప‌థ‌కాన్ని అమలు చేయ‌ద‌ని ప‌లువురు ప్ర‌తి ప‌క్ష నేత‌లు ఆరోపించారు. అయితే ద‌ళిత బందు ప‌థ‌కాన్ని వందకు వంద శాతం అమ‌లు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ హామీని నిజం చేస్తూ పథకానికి నిధులు విడుదల చేశారు.

ద‌ళిత బందు ప‌థ‌కంతో ఇప్పటికే హుజురాబాద్ లో కొందరు లబ్ధిపొందారు. ఇక ఈ పథకం అమ‌లు చేయ‌డానికి మరో నాలుగు మండ‌లాను ప్రభుత్వం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. చింత‌కాని, తిరుమ‌ల గిరి, చారకొండ‌, నిజాంసాగ‌ర్ మండ‌లాల‌ను ద‌ళిత బందు ప‌థకానికి అమలుకు ఎంచుకున్నారు. ఆ నాలుగు మండ‌లాల్లో ద‌ళిత బందు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది. రూ.250 కోట్లతో ఈ నాలుగు మండ‌ల‌లో ద‌ళిత బందు పథ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. చింతకాని మండ‌లానికి రూ.100 కోట్లు కేటాయించారు. మిగిలిన మూడు మండ‌లాలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ నాలుగు మండ‌లాల్లో ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అర్హులను గుర్తించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/