జగన్‌ కు పెద్ద షాక్ ఇచ్చిన ఉద్యోగ సంఘాలు

cm jagan

కొంత కాలంగా పీఆర్సీ అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ వ్యవహారం కాకరేపుతోంది. ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన ఉద్యోగ సంఘాలు..ఇక ఇప్పుడు జగన్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చారు.

ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని…ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు. అధికారంలోకి వస్తే..వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదని… జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు రావడం లో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందన్నారు.

ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా? పీఆర్సీ నివేదిక శుక్రవారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు మార్చి నాటికి క్లియర్ చేస్తామని చెప్పారని… అందుకే నిన్నటి సమావేశం బాయ్ కాట్ చేశామని ఆయన వెల్లడించారు. మా రెండు జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయని..మా సంఘాలన్నీ క్రింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.