టీమిండియాకు ఐసిసి భారీ షాక్!
దుబాయి: న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఐసిసి భారీ షాక్ ఇచ్చింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది. న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించని కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా, 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. దీంతో ఐసిసి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఒక్కో ఓవర్కు 20 శాతం చొప్పున 2 ఓవర్లకు గాను మొత్తం 40 శాతం జరిమానా విధించారు. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్, షాన్ హైగ్, మూడో అంపైర్ మెహోత్రా కోహ్లీసేనపై అభియోగాలు నమోదు చేశారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరుగదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/