రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ చిత్తుచిత్తుగా ఓడిపోనుంది – అచ్చెన్నాయుడు

రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోనుందని అన్నారు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు. ప్రజలు జగన్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అయన అన్నారు. డ్వాక్రా గ్రూపులకు చంద్రబాబు రూ. 5 లక్షల వరకూ సున్నా వడ్డీ రాయితీ వర్తింపజేయడంతో మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని , వడ్డీ రాయితీని రూ. 10 లక్షల వరకూ వర్తింపజేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన జగన్… అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా ఇవ్వకుండా రూ. 3 లక్షలకు కుదించడం మోసకారి సంక్షేమం కాదా? జగన్ రెడ్డీ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

జగన్ చేసిన మోసం వల్ల పొదుపు మహిళలకు లబ్ధి రూ. 30 వేలకు తగ్గిపోయిందని అచ్చెన్న దుయ్యబట్టారు. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆచరణలో జగన్ రెడ్డి మొండిచేయి చూపాడని, చేయూత పథకంతో చేతివాటం ప్రదర్శించాడని… పథకం కింద అన్ని కులాలు కలిపి కేవలం 30 లక్షల మందికి మాత్రమే లబ్ధి అంటే మిగిలిన 85 లక్షల మంది సంగతేంటి జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మహిళలు జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.