కాంగ్రెస్ పార్టీలో YSRTP విలీనం ఫై త్వరలోనే సమాధానం చెపుతా – వైస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న ఆశయాలను తీసుకొస్తా..గడీల పాలన అంతం చేస్తా..కేసీఆర్ ను గద్దె దించుతా అంటూ సవాళ్లు చేస్తూ YSRTP పార్టీ ని స్థాపించిన వైస్ షర్మిల..ప్రస్తుతం తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా బెంగుళూర్ – ఢిల్లీ లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన షర్మిల..శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చారు.

ఈ నేపథ్యంలో షర్మిల ను ఎయిర్ పోర్ట్ లో మీడియా వారు చుట్టుముట్టి, విలీనం కు సంబంధించి వరుస ప్రశ్నలు వేశారు. దీనికి ఆమె త్వరలోనే సమాధానం చెపుతా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. మరోపక్క, ఆమెను భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి విదితమే.