కొండపోలం సెన్సార్ టాక్

ఉప్పెన సినిమాతో సంచలన ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండపొలం ఉప్పెన విడుదల కంటే ముందే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. అయితే కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. కొండ పొలం నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కేవలం 45 రోజుల్లోనే మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో డీ గ్లామర్ పాత్రలో నటించింది. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర సెన్సార్ కార్య క్రమాలను పూర్తిహ్ చేసారు.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ/ ఏ సెర్టిఫికెట్ జారీచేశారు. అడవిని నమ్ముకున్న కొంతమంది గిరిజనులు .. వాళ్ల జీవనోపాధికి అడ్డుపడే కొంతమంది బలవంతుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. తన తాత .. తండ్రి నుంచి అడవిని ఇల్లుగా భావిస్తూ వచ్చిన ఓ యువకుడు ఏం చేశాడనేదే కథ అని తెలుస్తుంది. అడవిలోని గిరిజనులు తమ మనుగడ సాగించడానికి ఒక వైపున క్రూర మృగాలతోనే కాదు, అంతకంటే క్రూరంగా ఆలోచించే కొంతమంది మనుషులతో కూడా పోరాటం హీరో పోరాటం చేసాడు. మరి ఆ పోరాటం ఎలా సాగిందనేది మీరు తెరపై చూడాల్సిందే. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు కలిసి నిర్మించారు.