టిడిపి హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందిః విజయసాయిరెడ్డి
వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అప్పులు 55 శాతానికి తగ్గాయని వెల్లడి
అమరావతిః టిడిపి హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందని వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని చెప్పారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55 శాతానికి తగ్గాయని తెలిపారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు టిడిపి ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని విమర్శించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా, వారి కలలు సాకారమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ డబ్బును వినియోగిస్తున్నారని చెప్పారు. టిడిపి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నారు.