పార్లమెంట్ ఘటన..ఉపరాష్ట్రపతి జగదీప్కు ప్రధాని మోడీ ఫోన్
న్యూఢిల్లీ: మాక్ పార్లమెంట్ నిర్వహించి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ పై మిమిక్రీ చేసిన విపక్ష సభ్యుల ప్రవర్తనను ప్రధాని మోడీ ఖండించారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని అన్నారు. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాని.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు. మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు.. మకర ద్వారం వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్ను వెక్కిరిస్తూ నాటకం వేసిన విషయం తెలిసిందే. టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ.. చైర్మెన్ జగదీప్ తరహాలో నటిస్తూ ఆయన్ను అవమానించారు.
ఈ నేపథ్యంలో జగదీప్కు మోడీ ఫోన్ చేశారు. 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని, ఇంకా అలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని, రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోడీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫోన్లో వెల్లడించినట్లు ధన్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరు అని ప్రధానికి ఫోన్లో చెప్పిటన్లు చైర్మెన్ ధన్కర్ తెలిపారు.