శామీర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర ప్రమాదం
మేడ్చల్ జిల్లా శామీర్పేట ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్పేట-కీసర మధ్య ఔటర్ రింగ్రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో , టాటా టియాగో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు, లారీ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు బొలేరో వాహనంలోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం తో ఓఆర్ఆర్పై భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించిన సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.