లోకేష్‌ పాదయాత్ర..ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు

Lokesh Padayatra..Officials removed flexi

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అదేమంటే.. ఎన్నికల కోడ్ ఉందని ఫ్లెక్సీలు తొలగించామని అధికారులు చెబుతున్నారు. యువగళం ఫ్లెక్సీల తొలగింపుపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకపోతే బతకలేమని నారా లోకేష్ పేర్కొన్నారు. నేడు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన రజకులతో ముఖాముఖి నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేందుకు కేరళ తరహాలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. బీసీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దొంగ కేసులు పెట్టి లొంగ తీసుకోవాలని చూస్తున్నారన్నారు. మేము ప్రభుత్వంలోకి రాగానే జ్యూడిషరీ ఎంక్వయిరీ చేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినవారిని డిస్మిస్ చేస్తామన్నారు.

1983 తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మంత్రి పదవిలో బీసీల సంఖ్య పెరిగిందని నారా లోకేష్ పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో ఏపీలో పేదరికం లేకుండా చేస్తామన్నారు. రజకులను ఎస్సీలుగా రిజర్వేషన్లు కల్పించటం సత్యపల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో రజకుల భవనానికి వంద రోజుల్లో భూమి కేటాయిస్తామన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దోబీ ఘాట్‌లో గదులు నిర్మిస్తామని.. ఆధునికరణ చేస్తామన్నారు. ధోబిఘాట్‌లో గతంలో టిడిపి ఉచిత విద్యుత్ ఇచ్చేదని… జగన్ రాగానే బిల్లులు బాదుడు మొదలైన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే తిరుమలలో ధోబిఘాట్లలో రజకులకే అవకాశాలు కేటాయిస్తామన్నారు.