మంత్రి పదవి శాశ్వతం కాదు..నోరు అదుపులో పెట్టుకోవాలి..రోజా కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్

bandla ganesh
bandla ganesh

సినీ నిర్మాత , నటుడు బండ్ల గణేష్ తాజాగా ఏపీ రాజకీయాల ఫై స్పందించారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..వైస్సార్సీపీ మంత్రులు ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అంటున్న మాటల ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రోడ్లపై తిరుగుతున్నారన్నారు. పవన్ తప్పు గా మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు హుందాగా విమర్శించాలి కానీ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దన్నారు. ముఖ్యంగా రోజా , అంబటి రాయుడు , అమర్ నాధ్ వంటి వారు మరింత రెచ్చిపోతున్నారని , మంత్రులు, నేతల వల్ల జగన్‌ ఇబ్బంది పడతారని.. రాజకీయాలు చేయాలి కానీ బూతులు మాట్లాడొద్దన్నారు. మంత్రి పదవి, అధికారం, హోదా శాశ్వతం అనుకోకూడదని హితవు పలికారు.

అలాగే లోకేష్ పాదయాత్ర ఫై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఎవర్నో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నానని.. లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన సమయంలో ఏం చేస్తాడులే అని తనకు అనిపించిందన్నారు.కానీ లోకేష్ ఒకటో రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు గమనిస్తే లోకేష్ చాలా మారిపోయారన్నారు. రాజకీయాలపై పట్టు, జనరల్ నాలెడ్జ్, ప్రసంగాల్లో చాలా మార్పు కనిపించిందన్నారు.